కాళకృత్యాలకు వెళ్లి కాలువలో గల్లంతైన యువకులు..

by Sumithra |   ( Updated:2025-03-15 18:10:03.0  )
కాళకృత్యాలకు వెళ్లి కాలువలో గల్లంతైన యువకులు..
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని జక్కల్ దానీ తాండా వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా వారిలో రాజు అనే యువకుడిని ఉపాధి హామీ కూలీలు కాపాడారు. సిద్దార్థ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు సంగ్రామం తాండాకు చెందిన వారిగా గుర్తించారు. బాన్సువాడ నుంచి సంగ్రామం తాండకు వెళ్ళే సమయంలో కాళకృత్యాలకు వెళ్లి కాలువలో దిగి నీటి ప్రవాహానికి గల్లంతయినట్టు సమాచారం..

READ MORE ...

తప్పిన పెను ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన పిల్లల ఆటో

బోయినపల్లిలో పాఠశాల బస్సు బోల్తా


Next Story